మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు

TRINETHRAM NEWS

మార్చి 18 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉంటాయన్నారు. ప్రాక్టికల్స్‌ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కొనసాగుతాయన్నారు.

పరీక్ష ఫీజును జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19వరకు ఆన్‌లైన్‌లో చెల్లించొచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్‌కు రూ.1000, పదో తరగతికి రూ.500తోపాటు సబ్జెక్టులకు నిర్దేశించిన పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

You cannot copy content of this page

Scroll to Top