Telangana Budget Sessions : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

TRINETHRAM NEWS

మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్న సమావేశాలు

మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

మార్చి 20న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో నిర్ణయం

Trinethram News : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు.

సమావేశాల తొలిరోజైన మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుపుతారు. మార్చి 20వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Assembly Budget Sessions

You cannot copy content of this page

Scroll to Top