డిండి (గుండ్ల పల్లి)జులై 26. త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న దురదృష్ట సంఘటన శనివారం చోటుచేసుకుంది.
డిండి మండలంలోని మండల ప్రాథమిక పాఠశాలలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు జాజుల అనిల్ తండ్రి సామేలు వయస్సు 53 సంవత్సరాలు మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తూ పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు పంపిస్తున్నట్టు డిండి మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


