ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 01 at 9.31.51 PM

TRINETHRAM NEWS

తాడేపల్లి

ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలుస్తారు.

రైల్వే స్ధలాల్లో ఇళ్ల భాధితుల టిడిపి భరోసా.

రైల్వే స్ధలాల్లో నివాసులు ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలిస్తారని టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు భరోసా ఇచ్చారు. గురువారం పట్టణంలోని రైల్వే స్ధలాల్లో ఇళ్లును పరిశీలించిన వెంకట్రావు మాట్లాడుతూ గతంలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారమే టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ స్ధలాలను రెగ్యులేషన్ చేసి ఉన్నచోటే ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ధారా దాసు, నాయకులు ఇట్టా భాస్కర్, అద్దంకి మురళి, కేళి వెంకటేశ్వరావు, కె. నిర్మల తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page