వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ క్రిస్మస్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చీలో జరిగిన వేడుకలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .
పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఫాస్టర్లు, క్రిస్టియన్ సమాజ సభ్యులు.ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ తన సందేశాన్ని అందిస్తూ. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఏసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలోనే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టింది కూడా డిసెంబర్ నెలలోనే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పుతో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది కూడా డిసెంబర్ నెలలోనే. శాసన వ్యవస్థలో అత్యున్నతమైన స్పీకర్ పదవి బాధ్యతలు నేను స్వీకరించింది కూడా డిసెంబర్ నెలలోనే.
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకాలు. ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని ఏసుక్రీస్తు బైబిల్ శాంతి సందేశం ద్వారా మానవాళికి తెలిపారు.
భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


