WhatsApp Image 2024 03 27 at 14.39.19
Trinethram News : Mar 27, 2024,
SBI కస్టమర్లకు షాక్
దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం SBI డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ.75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
