Savitribai Phule : సావిత్రి బాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

TRINETHRAM NEWS

సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసిన సావిత్రిబాయి ఫూలే
మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే .
-భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే
-స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమ కారిణి
-కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి.

  • మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి.

దేవరకొండ డివిజన్ జనవరి 03 త్రినేత్రం న్యూస్. సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి సావిత్రిబాయి ఫూలే అన్నారు.శనివారం మాల మహానాడుదేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మహిళా హక్కుల కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే అని ఆయన అన్నారు.భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు.

ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన గొప్ప ఉద్యమ కారిణి సావిత్రి భాయి పూలే అని ఆయన అన్నారు.స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమ కారిణి సావిత్రి భాయ్ పూలే అని కొనియాడారు.కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అన్నారు.

సావిత్రి భాయ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్క మహిళా ఉపాధ్యాయినిలు కృషి చేయాలన్నారు.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రి భాయ్,తన భర్తతో కలసి1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు.

కుల వ్యవస్థకు,పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,శూద్రుల,అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని గుర్తు చేశారు.నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని కొనియాడారు.ఆమె ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పాటు పడాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Savitribai Phule should strive to achieve her dreams

You cannot copy content of this page

Scroll to Top