Record-Breaking Darshans : రికార్డ్ స్థాయిలో దర్శనాలు

TRINETHRAM NEWS

తిరుపతి జిల్లా : జనవరి 09 : (త్రినేత్రం న్యూస్); తిరుమలలో వెంకటేశ్వర సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి రికార్డు స్థాయిలో ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలు మరియు దర్శన భాగ్యంపై చైర్మన్ బి ఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

గత పది రోజుల్లో ఏడు లక్షల, ఎనబై మూడు వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని, ఆ దేవస్థానం చేసిన ఏర్పాట్లపై తొంభై మూడు శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.

ఏ – ఒకటి కంట్రోల్ రూమ్ ద్వారా క్యూ లైన్లను పర్యవేక్షించి సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రత్యేకవేర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Record-breaking darshans

You cannot copy content of this page

Scroll to Top