తేదీ : 09/10/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నర్సీపట్నం వెళ్లిన జగన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఆ కార్మికులకు వైసిపి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అధికారం, ప్రతిపక్షం లో ఉన్నా లేకున్నా, మీ పక్షాన ఉంటానని తేల్చి చెప్పారు. ఆ ప్లాంట్ ను కాపాడుకొనేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని, ప్రధాని నరేంద్ర మోధీ కి సంబంధించిన లేఖలు కూడా రాశామని గుర్తు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


