Nara Lokesh : ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం

TRINETHRAM NEWS

తేదీ : 09/10/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా తన కుటుంబసభ్యులని , వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవడం ఆయన బాధ్యతని విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా .లోకేష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో పిన్నె ల్లి. రామకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో గాయపడి అస్వస్థతతో ఇటీవల మరణించిన శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లికి రప్పించి మాట్లాడారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయన గట్టిగా పోరాడారని, స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఇలాగే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will help you in any difficulty

You cannot copy content of this page

Scroll to Top