
Ravindra Kumar : చందం పేట జూన్ 24, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం తేల్దేవరపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.అనంతరం గ్రామస్తులు మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నీ సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య,కేతావత్ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ గణేష్, తరి గోవర్థన్, వడత్య బాలు , పల్లా లోహిత్ రెడ్డి, జగన్ చారి,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe