
అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామం.
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Ramavat Ravindra Kumar : దేవరకొండ డివిజన్ మార్చ్ 27, త్రినేత్రం న్యూస్. అనంత విశ్వంలో సుమధుర పదం శ్రీరామ నామమని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవరకొండ మండలం ఎద్దంపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ….. సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్ధకం అవుతుందన్నారు. సీతారాముల అనుగ్రహంతో సర్వదోషాలు తొలగిపోతాయని అన్నారు.
సీతారాముల జీవితం ఆదర్శప్రాయమైందని అన్నారు. నిజాయితీ, సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి వైదొలగిన తర్వాత జరుపుకుంటున్న పెద్ద పండుగల్లో ఇదొకటని అన్నారు. శ్రీరామచంద్రుడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమి హిందువులకు అత్యంత విశేషమైన పండుగ. ప్రతి ఇంట్లో ఈ వేడుకను జరుపుకుంటారని అన్నారు. శ్రీరామచంద్రస్వామి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు.
సత్యమార్గాన్ని అనుసరిస్తూ తండ్రి ఆదేశాన్ని పాటించిన రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పద్నాలుగేండ్ల పాటు అడవుల్లో ఉన్న తర్వాత అయోధ్య చేరుకున్నాడు. అప్పుడు జరిగిన శ్రీరామ పట్టాభిషేకం చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తులు భావిస్తారు. శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది కూడా ఇదే రోజే కావడం విశేషం. అందుకే శ్రీరామ నవమి నాడు ఎంతో వైభవంగా సీతారాముల కల్యాణం జరుపుతారు. భక్తులకు పానకం, వడపప్పు పంచిపెడతారని అన్నారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలు భక్తి, శ్రద్ధలతో ఇంటిల్లిపాది శ్రీరామ నవమి వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, మల్ రెడ్డి అనిత రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,నూతగంటి రఘు, పేర్ల యాదయ్య, కొమ్ము ఉదయ్, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

