Ramagundam MLA with Minister : మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు ఎమ్మెల్యేతో కలిసి ఎమ్మెల్యే మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి

TRINETHRAM NEWS
Ramagundam MLA with Minister Ponnam Prabhakar

Ramagundam MLA with Minister : త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి… రామగుండం నిజమైన శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ శాసన సభ ఆవరణ లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉగాది పండుగ సందర్భంగా మట్టి పాత్రలు అందజేయడం జరిగింది పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని “మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి – కుల వృత్తులను ప్రోత్సహించండి” నినాదంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉగాది మట్టి పాత్రలను అందించడం జరిగింది అందులో ఉగాది పండగ కి ఉపయోగపడే మట్టి కుండా, గ్లాస్ లు , జగ్గు ,బౌల్, షడ్రుచులు ఉండే మామిడి కాయలు , వేప పువ్వు , బెల్లం , చింతపండు ,కారం వస్తువులు ఉగాది కిట్ లో అందజేశారు.

ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రజలకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని కాపాడడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి పాత్రలు ఉపయోగించాలని , ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించడం జరిగింది మన సంస్కృతి సంప్రదాయాలకు పండగలతో మట్టి పాత్రలు అనువైనవి ,మట్టి పాత్రలు వినియోగాన్ని పెంచి కుల వృత్తులను కాపాడడానికి అందజేయడం జరిగింది . మట్టి పాత్రలు వాడకం తరతరాల సంప్రదాయం.. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి ,కుల వృత్తులను కాపాడండి .. ఆరోగ్యాన్ని రక్షించుకోండి అనే నినాదంతో పండగ జరుపుకోవాలి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top