త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డి పేట్ సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ భవన ప్రారంభోత్స కార్యక్రమంలో రాష్ట్ర ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, పర్యాటకం, సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌరవ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య.
అనంతరం ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ , ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


