
Penalty for Negligence : త్రినేత్రం న్యూస్ : Mar 18, 2026, ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 4 నుంచి మూల్యాంకనం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనం విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే జరిమానా విధించేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో తప్పులు చేసినా, మార్కుల నమోదులో పొరపాట్లు జరిగినా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

