
National Lok Adalat : త్రినేత్రం న్యూస్ : కూకట్పల్లి జూన్ 20 (త్రినేత్రం న్యూస్) : మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం రోజు కూకట్పల్లి కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ (నేషనల్ లోక్ అదాలత్ ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. వెంకటేశ్వరరావు , 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ రామ్ ప్రసాద్ , ఇతర న్యాయమూర్తులు, డీసీపీ రితి రాజ్ మరియు వారి బృందం, కూకట్పల్లి కోర్టు జనరల్ సెక్రటరీ సురేందర్ గౌడ్ మరియు కార్యవర్గ సభ్యులు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ జాతీయ లోక్ అదాలత్లో వివిధ రకాల కేసులకు సంబంధించిన లిటిగెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరస్పర అవగాహనతో అనేక కేసులు విజయవంతంగా పరిష్కారం కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు,లిటిగెంట్లు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నేషనల్ లోక్ అదాలత్ విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe