ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలో అతి వేగంగా శతకం సాధించిన నమీబియా క్రికెటర్

TRINETHRAM NEWS

Trinethram News : నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాప్టీ – ఈటన్ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లలో కేవలం 33 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

ఈ ఆటగాడు నేపాల్ టీమ్ తో జరిగిన టీ 20 మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లో 101 పరుగులు కొట్టాడు. ఇందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు.

ఈ రికార్డ్ ఇంతకు ముందు 34 బంతుల్లో సెంచరీ చేసిన కుశాల్ మల్లా పేరిట ఉండేది. ఇతని రికార్డ్ బద్దలుకొట్టి 33 బంతుల్లో సెంచరీ చేసిన నమీబియా ఆటగాడు.

భారత క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ లు 35 బంతుల్లో సెంచరీ చేసిన సంగతి అందరికి తెలిసిందే..

You cannot copy content of this page

Scroll to Top