
MLC Anantha Babu’s Wife : త్రినేత్రం న్యూస్ : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడలోని ఎస్డీపీవో కార్యాలయంలో విచారణ అధికారి మనీశ్ పాటిల్ దేవరాజ్ ముందు విచారణకు హాజరుకానున్న లక్ష్మీదుర్గ అలియాస్ రోజా. సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు పోలీసుల గుర్తింపు. కేసులో లక్ష్మీదుర్గను ఏ-2గా చేర్చి రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్. తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టివేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన లక్ష్మీదుర్గ. ఈరోజు నుంచి ఈ నెల 30 వరకు సిట్ ఎదుట, ఈ నెల 30న కోర్టులో విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు తీర్పు.

