త్రినేత్రం న్యూస్, మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చెయ్యాలని శ్రీ ఆంజనేయస్వామికి మొక్కుకున్న మొక్కు నెరవేరటంతో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,
మండపేట పట్టణంలో వేగుళ్ళ వీర్రాజు సెంటర్ (కలువపువ్వు సెంటర్) నందు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ ఆంజనేయస్వామి వార్కి మంగళవారం 101 టెంకాయ కొట్టి మొక్కు చెల్లించారు.
ఈ సంధర్బంగా స్వామివార్కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, జొన్నపల్లి సూర్యారావు, పాలచర్ల శిరీష్, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


