త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం సాతంబాకo పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు. వీరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దినేని రుద్రయ్య నాయుడు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ సమక్షంలో టిడిపిలో చేరారు.
వారిని జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పసుపు కండువలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే థామస్ వారి అభివృద్ధిని కార్యక్రమాలు చూసి టిడిపిలో చేరినట్లు చెప్పారు.
టిడిపిలో చేరిన వారిలో బాలచంద్రారెడ్డి, జ్యోతిశ్వర్ రెడ్డి, దేవా రెడ్డి, సూరి, భాస్కర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, జయరామిరెడ్డి ఉన్నారు. వారి ఆహ్వానించిన వారిలో గుర్రప్ప నాయుడు, పరమేశ్వర్ రెడ్డి, మరియు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


