Friday Dry Day Program : ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించిన వైద్యాధికారి భరత్ కుమార్

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా 01ఆగస్టు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిసరాల ప్రాంతంలో ఫ్రైడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. బి.సాంబశివరావు హాజరై మాట్లాడుతూ శుక్రవారం రోజున దేశాయిపేట పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు ముఖ్యంగా పరిసరాల ప్రాంతాలలో నీరు నిల్వకుండా చూడాలని, పౌష్టిక ఆహారం తీసుకోవాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, పరిసరాలు పరిశుభ్రత ఉంచుకోవాలని..

నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ అనగా షుగర్, బీ.పీ, మరియు తదితర ఉన్నవాళ్లను గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని డాక్టర్ భరత్ కుమార్ కి డిఎంహెచ్వో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్.టి.భరత్ కుమార్ , పబ్లిక్ హెల్త్ మేనేజర్ జన్ను కోర్నెల్ ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Friday Dry Day program..

You cannot copy content of this page

Scroll to Top