తేదీ : 16/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ మేయర్ హరి. వెంకట కుమారి భావోద్వేవానికి గురై కంటతడి పెట్టుకోవడం జరిగింది. తనను పడగొట్టేందుకు సామాజిక వర్గానికి చెందిన నేతలే కుట్ర చేస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి గుర్తుపై విజయం సాధించినప్పటికీ ఇప్పుడు అదే పార్టీ నేతలు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదని పేర్కొన్నారు. నన్ను తొలగించేందుకు మా వాళ్లు కంకణం కట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


