బాలు నాయక్ , దేవరకొండ శాసనసభ్యులు.
INTUC జెండాను ఆవిష్కరించి,కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ .
దేవరకొండ మే 1 త్రినేత్రం న్యూస్. అంతర్జాతీయ కార్మిక (మే డే) దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఐఎన్టీయూసీ 327 అధ్వర్యంలో నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొని,INTUC జెండాను ఆవిష్కరించి,కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
అనంతరం కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా ఎమ్మెల్యే కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మికుల శ్రమతోనే సమాజాభివృద్ధి సాధ్యమని, దేశ నిర్మాణంలో వారి త్యాగం అమూల్యమని పేర్కొన్నారు.
కార్మికుల శ్రమ, పట్టుదల, అంకిత భావాన్ని స్మరిస్తూ వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్,మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి,మేకల శ్రీనివాస్ యాదవ్,జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, నేరేడుగొమ్ము మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని కృష్ణయ్య,మాజీ ఎంపీపీలు గోవింద్ యాదవ్, బిక్కు నాయక్, సీనియర్ నాయకులు తిపార్థి రుక్మా రెడ్డి,INTUC 327 సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు,NSUI నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


