Nenavath Balu Naik : దేవరకొండ నియోజకవర్గం లో సాగునీరు, ప్రతీ పేదవారికి ఇందిరమ్మ ఇల్లు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే, నేనావత్ బాలు నాయక్.

దేవరకొండ ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్.
చందంపేట మండలం పరిధిలోని గుంటిపల్లి గేట్ వద్ద ఐకెపి, పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పంటకు తగిన మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పాక్షిక విజయాన్ని సాధించింది అన్నారు.
రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో నే ధాన్యం విక్రయించాలని దళారుల నమ్మి మోసపోవద్దని సూచించారు .ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలని ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ కొండ శ్రీశైలం యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు బద్య నాయక్, కృష్ణయ్య, పిఎసిఎస్ చైర్మన్ వీరారెడ్డి మాజీ ఎంపీపీలు గోవింద్ యాదవ్ దిక్కు నాయక్ మాజీ జెడ్పిటిసి బుజ్జిరావ్ నాయక్ మాజీ సర్పంచులు దొందేటి మల్లారెడ్డి అనంతగిరి బల్లు రామకృష్ణ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి కొండల్ రెడ్డి సురేందర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు మాజీ ఎంపీటీసీ వెంకటయ్య యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు యువజన నాయకులు సుజిత్ ప్రజా ప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Irrigation water in Devarakonda

You cannot copy content of this page

Scroll to Top