Man Climbed : హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు

TRINETHRAM NEWS
man who climbed a high-tension tower

త్రినేత్రం న్యూస్ : Man Climbed : తెలంగాణ : జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన సూర రాజు అనే యువకుడు, తన ప్రియురాలు ఫోన్ నంబర్ బ్లాక్ చేయడంతో శుక్రవారం మోరంచపల్లి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కాడు.

ఆమె మాట్లాడితేనే దిగుతానని మొండికేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, గణపురం సీఐ కర్ణాకర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. ఈ ఘటనతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top