Trinethram News : ఇచ్ఛాపురం : శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గమేష్ నాయక్ అనే వ్యక్తి 9.2 కిలోల గంజాయితో పట్టుబడినట్లు ఇచ్చాపురం సీఐ చిన్నం నాయుడు బుధవారం వెల్లడించారు. ఒడిశాలోని గెరెగెడి గ్రామానికి చెందిన గమేష్, తన కుటుంబ పోషణకు డబ్బులు సరిపోక, గంజాయి రవాణా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ గంజాయిని కర్ణాటకలోని మైసూరులో బబ్లూ కుమార్ అనే వ్యక్తికి కిలో రూ.10వేలకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


