ఫలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి
త్రినేత్రం న్యూస్, ప్రతినిధి. మండపేట నియోజకవర్గం కేశవరం రైల్వే గేటు దగ్గర ఓవర్ బ్రిడ్జి లేక జిల్లా ప్రజలు యేళ్ళ తరబడి ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ విదితమే. ముఖ్యంగా ఈ రైల్వే గేటు మార్గం అనపర్తి నియోజకవర్గానికి అత్యంత కీలకం. వందలాది మంది అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఈ దారి గుండా రాజమండ్రి తదితర ప్రాంతాలకు పయనిస్తుంటారు.
ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల డిల్లీ వెళ్ళి వివిధ అభివృద్ది పనుల నిమిత్తం కేంద్రమంత్రులను కలసినపుడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం గురించి కూడా మంత్రులతో మాట్లాడటం జరిగింది. తన నియోజకవర్గ పరిధి కాకపోయినా అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఎక్కువ ఉపయోగకరమైన పని కావడంతో మండపేట, ఎమ్మెల్యే, వేగుళ్ళ జోగేశ్వరరావు అనుమతితో నాడు కేంద్రమంత్రులతోను ఆ తర్వాత జిల్లాకు వచ్చిన రైల్వే అధికారులతో సమావేశంలోను ఎంపీ పురంధేశ్వరి,తో కలసి ఈ ఓవర్ బ్రిడ్జి ఆవశ్యకతను వివరించారు నల్లమిల్లి.
వీరి కృషితో ఈ కేశవరం ఓవర్ బ్రిడ్జికి మోక్షం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల రైల్వేశాఖ రామచంద్రపురం ఆర్ డి ఓ కి భూసేకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇపుడున్న గేటు వద్ద కాకుండా కడియం వైపు వరిభూములను వంతెనకు సరిపడా సేకరించాల్సిందిగా వాటికి సంబంధించిన వివరాలను పేర్కొంటూ వెల్లడించింది.
407 వ కిలోమీటరు వద్ద రాకుండా 409 వ కిలోమీటరు వద్ద వంతెన నిర్మాణానికి పొలాలను సేకరించవలసిందిగా ఆర్ డి ఓ కి ఇచ్చిన ఉత్తర్వులలో రైల్వేశాఖ పేర్కొంది.
ఈ క్రమంలో యేళ్ళ తరబడి ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎమ్మెల్యే, నల్లమిల్లి అటు కెనాల్ రోడ్డు సమస్యకు ఇటు కేశవరం రైల్వే గేటు సమస్యకు పరిష్కారం కోసం కృషిచేయడం ఎంతైనా అభినందనీయం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


