రాజానగరం:త్రినేత్రం న్యూస్ : రాజానగరం మండలం, మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ” ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో” సమాచార హక్కు చట్టం 2005 ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలు అధికారులు నిర్వహించాల్సిన రికార్డ్స్ పై అధికారులకు, స్థానిక మహిళా సంఘాల వార్కి మహిళా సంరక్షణ చట్ట లపై అవగాన కార్యక్రమం ఆర్గనైజేషన్ ఉత్తరాంధ్రా చైర్మన్ కోడి తాతరావు కిషోర్ ఆధ్వర్యంలో” నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమము నకు ముఖ్య అతిథిగా ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు సమాచార హక్కు చట్టం2005, వినియోగదారుల రక్షణ చట్టం 1986, వీలునామా చట్టం, తల్లిదండ్రులు వయో వృద్ధుల రక్షణ చట్టం 2007 చట్టాలపై వివరణ ఇవ్వడం జరిగినది,
అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం జాతీయ నాయకులు మనవల ఆంజనేయులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ఆకృత్యాల నిరోధక చట్టం గూర్చి మాట్లాడగా, స్థానిక మండల అభివృద్ధి అధికారి జె . ఏ. ఝాన్సీ మాట్లాడుతూ స్థానిక సమస్యలపై మహిళలు గలము విప్పాలని అన్నారు, మండల రెవిన్యూ తహశీల్దార్ సత్యవతి దేవి మాట్లాడుతూ, భూమి హక్కులపై ముఖ్యంగా పట్టారు పాసుపుస్తకాలు అవగాహన కల్పించారు, డీ.ఆర్.డి.ఏ.వెలుగు అసిస్టెంట్ మేనేజర్ గుమ్మడి సునీత, డిప్యూటి తహశీల్దార్ ఉండమట్ల రాజు, మహిళా హక్కుల గూర్చి వివరణ తెలియజేశారు, ఈ కార్యక్రంలో” ఆర్గనైజేషన్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ కుందేటి వెంకట రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లోకా మల్లి బాబు, పల్లపాటి మహేష్, కోడి శరత్ సాగర్, నితిన్ సాగర్, ఆర్గనేషన్ సభ్యులు, మరియు స్థానిక వెలుగు సి. సి.లు, యానిమేటర్స్, పంచాయితీ రాజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


