కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 27 : కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి, సీఐగా టి.నరసింహ రాజు నూతనంగా బాధ్యతలు చేపట్టారు.కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య మంగళవారం రోజు మర్యాద పూర్వకంగా కలిసి పూలదండ వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ బాలానగర్ జోన్ లోని ప్రజలందరు ఏలాంటి సమస్యలు,ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని సూచించారు.బాలానగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ నరసింహారాజును ఇటీవల ఉత్తమ ఇన్స్పెక్టర్ గా తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ రెడ్డి నుండి అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ధనుంజయ్ చారి, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, చంద్రకాంత్ రెడ్డి,సభ్యులు ఆనందరావు,సికిందర్ బాబా,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


