KTR : డిండి మండల కేంద్రంలో కె టి ఆర్ కు ఘనస్వాగతం

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లీ) సెప్టెంబర్ 28 త్రినేత్రం న్యూస్. అచ్చంపేటలో జరిగే సింహ గర్జన సభకు వెళ్తున్న బి ఆర్ ఎస్ ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు డిండి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు అధికసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. మాజీ ఎం ఎల్ ఏ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు పూల బొకేలు , శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా కాంపెల్లి హుస్సేన్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు .ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ డిండి మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, డిండి టౌన్ ప్రెసిడెంట్ గిరమోని శ్రీనివాస్, నాయకులు పీర్ మహమ్మద్, పున్న లింగమయ్య గుర్రం సురేష్ ,రషీద్, జయ వర్ధన్ , ఐలేష్ చారి, బాసీద్, ఖలీల్, జైపాల్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR receives grand welcome

You cannot copy content of this page

Scroll to Top