Trinethram News : కాకినాడ జిల్లా జగ్గంపేట మే 13: కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మే 13వ తేదీ మంగళవారం పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ముందుగా జగంపేట పరిణయ ఫంక్షన్ హాల్ లో పిల్లి వారి పరిశుద్ధ వివాహ మహోత్సవానికి హాజరై చిరంజీవి రాజేష్, లావణ్య దంపతులకు ఆశీస్సులు అందించారు. అనంతరం జగ్గంపేట శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిమ్మకాయల వారి రజస్వల వేడుకలకు హాజరై వీర సుష్మకు ఆశీస్సు అందించారు. అనంతరం రాజపూడి చల్లా నాగేశ్వరరావు ఫంక్షన్ హాల్ లో గల్లా వారి, కేశినేడి వారి వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరై చిరంజీవి హరి, సునీత దంపతులకు ఆశీస్సులు అందించారు.
జగ్గంపేట మండలం మావిడాడ గ్రామంలోపెంటకోట నాగేశ్వరరావు గారి కుమారుడు పెళ్ళికొడుకు చిరంజీవి అనిరుద్, నందిని దంపతులను ఆశీర్వదించి దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, పాండ్రంగి రాంబాబు, మారిశెట్టి రాధా, మండపాక అప్పన్న దొర, బోండా రాజేష్, రాయి సాయి, బచ్చల సుధీర్, చెలికాని హరిగోపాల్, బొడ్డేటి సుమన్, మారిశెట్టి గంగ, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


