MLA Battula : రధోత్సవం లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల

TRINETHRAM NEWS

రాజానగరం: త్రినేత్రం న్యూస్ : కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రధోత్సవంలో పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడారు.

త్రివిధ దళాలకు ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి, సామర్ధ్యాలు తోడవ్వాలి : ఎమ్మెల్యే *బత్తుల బలరామకృష్ణ, ఆర్మీ, నావి, ఎయిర్ ఫోర్స్, పారా మిలటరీ లకు ఘాటీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి సామర్ధ్యాలు తోడవ్వాలని, తద్వారా మన దేశం. మరింత దృఢంగా తయారవ్వాలని ఎమ్మెల్యే బత్తుల స్వామి వారి సన్నిధిలో అనేక ప్రత్యేక పూజలు జరిపించారు.

జీడీపీ లో 2 స్తానం లోకి మన దేశం దూసుకొని వెళ్ళాలి :

జీడీపీ లో 2 స్తానం లోకి మన దేశం దూసుకొని వెళ్ళాలని ఆశాభావం వ్యాక్యం చేసారు. మన దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు సమర్ధవంతమైన నాయకత్వంలో ముందుకు సాగాలని ఆయన కోరారు. అందుకోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు.

ఆలయ అధికారులు సేవలు అభినందనీయం :

అర్చనలు, అభిషేకాలు, కల్యాణోత్శోవం అనంతరం స్వామి వారి రథోత్సవం నిర్వహించడంలో ఆలయ అధికారులు సేవలు అభినందనీయమని బత్తుల తెలిపారు.

దేవతలకు సైనాధిపతి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు అందువల్లనే దేశం మొత్తం లో ఉన్న ప్రముఖ షణ్ముఖ దేవాలయాలలో జనసేన 21 మంది ఎమ్మెల్యే లతో ఓ ఆధ్యాత్మక కార్యకమానికి శ్రీకారం చుట్టారని పవన్ కళ్యాణ్, పుస్తక పరిజ్ఞానం అనంతం అందువల్లనే ఈ రోజు దేశం మొత్తం మీద మన దేశ శ్రేయస్సు కోసం, మన దేశానికి దైవ సంకల్పం తోడవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు,పవన్ కళ్యాణ్ తలపెట్టిన మహా సంకల్పంతో రాజానగరం శాసన సభ్యలు శ్రీ బత్తుల బలరామ కృష్ణ నాయకత్వంలో 150 మంది జన శ్రేణులతో కలసి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మరియు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కర్ణాటకలోని ఘాటీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో రెండవ రోజు కూడా ప్రత్యేక పూజలు (అర్చనలు, అభిషేకాలు, కల్యాణోత్శోవం అనంతరం రధోత్సవం పాల్గొన్నారు.

సాంప్రదాయ దుస్తులలో కర్ణాటక వాసులను ఆకట్టుకున్న జనసేన నాయకులు – కార్యకర్తలు :

ఓ ఆధ్యాత్మక కార్యకమానికి శ్రీకారం చుట్టారని పవన్ కళ్యాణ్ ఆదేనుసారం చేపట్టిన కార్యక్రమానికి బలరామ కృష్ణ, నాయకత్వంలో రాజానగరం నియోజక వర్గం నుండి వచ్చిన 150 మంది జనసేన పార్టీ నాయకులు – కార్యకర్తలు స్వామి వారికి ఇష్టమై రంగు దుస్తులలో కనిపించి కర్ణాటక వాసులను ఆకట్టుకున్నారు.

ఎమ్మెల్యే బత్తులతో సెల్ఫీల కోసం ఎదురు చూపులు :

150 జన శ్రేణులు ఒకే రకమైన దుస్తులలో ఆలయంలో కనిపించేసరికి, కర్ణాటక వాసుల దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్ళింది. వివరాలు తెలుసుకొని ఎమ్మెల్యే బత్తులతో వీడియోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

ఈ దైవ కార్యక్రమం లో మమ్మల్ని భాగస్వాములను చేయడం మా పూర్వజన్మ సుకృతం : జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు,

పవన్ కళ్యాణ్ అదేనుసారం ఈ దైవ కార్యక్రమం చేపట్టడం అందులో మమ్మల్ని భాగస్వాములను చేయడం మా పూర్వజన్మ సుకృతం అని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్ కి బత్తుల బలరామకృష్ణ,కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajanagaram MLA Battula in

You cannot copy content of this page

Scroll to Top