ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Janasena Discussion Forum

Janasena : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: జూలై 15; కైకలూరు నియోజకవర్గం, కైకలూరులో ఘనంగా జనసేన చర్చ వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో *జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్,రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ , ఆ పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు వాళ్లతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా కార్యకర్తల మధ్యకు వెళ్లి వాళ్లందరితో ఆత్మీయంగా మమేకమై, అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పలు కీలక సూచనలు చేశారు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) , నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ , జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమళ్ల చంద్రశేఖర్ , ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ , ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ,అలాగే జిల్లా నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page