చందంపేట మార్చ్ 04, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామ ప్రజలతో కలిసి హోలీ వేడుకల్లో జాలే నరసింహారెడ్డి (పీ సీసీ సభ్యులు, పీ ఏ సీ ఎస్ చైర్మన్,) పాల్గొని గ్రామ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సొంత ఊరు అంటే మధురమైన ఙ్ఞాపకాలు సమానత్వం పుట్టి పెరిగిన నేల మరియు ఆప్యాయతలు పంచుకునే బంధుమిత్రుల నిలయం అన్నారు.. అదే విధంగా పచ్చని పొలాలు చెరువులు మన ఇళ్ళు దేవాలయాలు మరియు బాల్య స్నేహితులు మన మూలాలను గుర్తు చేస్తాయి అన్నారు..
అదే విధంగా మనం నగర జీవితంలో ఎంత ఎదిగిన సొంత ఊరిలో దొరికే ప్రశాంతత ప్రేమ అద్వితీయం ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు మూల స్థానం.. అని తెలుపుతూ గ్రామ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


