త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వారు సమీక్షించారు. మరియు బెండలపాడు కు వెళ్లే దారిలో జరుగుతున్న డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న పనులను ఆయన సమీక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


