
నేనావత్ బాలు నాయక్ , శాసన సభ్యులు..
Indiramma Houses : దేవరకొండ డివిజన్ జూన్ 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం, శక్రు తండా గ్రామ పంచాయతీలో” తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .గృహ ప్రవేశం చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గ మాట్లాడారు. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడతామని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసింది.. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నడుస్తున్న ఈ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్థామని హామీ ఇచ్చారు. దేవరకొండ నియోజకవర్గంలోని ఇండ్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
