WhatsApp will not Work : మొబైల్‌లో సిమ్ లేకపోతే.. వాట్సాప్ పనిచేయదు.. ఎల్లుండి నుంచి కొత్త రూల్ అమలు

TRINETHRAM NEWS

Trinethram News : మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్‌ లేకుండా వాట్సాప్‌ పనిచేయదు. వాట్సాప్‌ వాడాలంటే సిమ్‌ తప్పనిసరిగా ఉండాలంటూ జారీచేసిన ‘సిమ్‌ అనివార్యం’ నిబంధనకు ఫిబ్రవరి 28 డెడ్‌లైన్‌గా కేంద్రం గతంలో ప్రకటించింది. .

ఈ డెడ్‌లైన్‌ను పొడిగించబోమని కేంద్రం స్పష్టంచేసింది. జాతీయ భద్రతకు, సైబర్‌ నేరగాళ్ల నుంచి యూజర్లను కాపాడేందుకే వీటిని అమలులోకి తెస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

కొత్త నిబంధనల ప్రకారం వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌, స్నాప్‌చాట్‌, షేర్‌చాట్‌, జియోచాట్‌, అరాటై, జోష్‌ లాంటి సామాజిక మాధ్యమాల వినియోగానికి మొబైల్‌ ఫోన్‌లో తప్పనిసరిగా సిమ్‌ ఉండాల్సిందే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

WhatsApp will not work

You cannot copy content of this page

Scroll to Top