మద్యం డబ్బు బిర్యానీలు అడగొద్దు
గ్రామానికి సేవకునిగా నేనుంటా
నన్ను ఆదరించి , గెలిపించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ముడి శ్రీను.
డిండి(గుండ్లపల్లి )డిసెంబర్ 02 త్రినేత్రం న్యూస్. స్థానిక ఎన్నికల్లలో గ్రామ సర్పంచిగా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ తెలిపారు.గ్రామ ప్రజలు యువకులు విద్యావంతులు నాపై నమ్మకంతో ఓటు వేయాలని కోరారు. గ్రామానికి సేవకునిగా నేనుంటా కానీ డబ్బు బీరు బిర్యానీలు అడగవద్దు గ్రామ నివాసిగా గ్రామ ప్రజలను కోరారు.
సంచలమైన వాస్తవాన్ని తెలియజేస్తున్నానని చెరుకుపల్లి ముడి శ్రీను డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన శ్రీను గ్రామపంచాయతీ ఎన్నికల్లో ముడి శ్రీను అనే వ్యక్తి తన ఉత్తేజాన్ని యువకులలో తీసుకొస్తున్నాడు గ్రామంలో సర్పంచ్ గా నామినేషన్ వేస్తాను గ్రామానికి నేను సేవకునిగా ఉంటా నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఇందుకు నన్ను వాడండి కానీ బీరు బిర్యానీ డబ్బులు అడగవద్దని వేడుకుంటున్నాడు గ్రామం అంతా తన వైపే చూస్తున్నారు అభివృద్ధి కోసం నిజాయితీతో పనిచేయడం నా దేహం అని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో 100% రాజీలేని పోరాటం చేస్తాను చెడు వ్యసనాలకు బానిసలు చేసే రాజకీయాలు నాకు దూరం అభివృద్ధి చేసేవాడే నాయకుడు ప్రజల పక్షాన నిలబడే వాడే ప్రజల నాయకుడు అలాంటి నాయకున్ని ఎన్నుకునే బాధ్యత ఓటర్లదే అని అన్నారు తన ప్రచారంలో యువత మహిళలు రైతులతో భేటీ అవుతూ గ్రామస్థాయి సమస్యలను తెలుసుకుంటూ నడుస్తున్నారు ప్రజలకు చేరువ అవుతూ అభివృద్ధి పట్ల తన దృఢత్వాన్ని తెలియజేస్తున్నారు అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ ఓటును అమ్ముకోవద్దు ఓటు అంటే బాధ్యత మీ ఓటును అమ్మితే భవిష్యత్తు అంధకారంలోకి నెట్టినట్టే సమాజం పట్ల అవగాహన అభ్యుదయ భావాలు ఉన్న నాయకుడిని గెలిపించాలని అభ్యర్థించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


