తేదీ : 24/12/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్): తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కౌస్తుభం గెస్ట్ హౌస్ లో చికెన్ బిర్యానీ, కోడిగుడ్లు బయటపడ్డాయి. ఇటీవల భద్రత వైఫల్యాలు తమిళనాడు రాష్ట్రానికి చెందిన భక్తులు వెంకటేశ్వర ఆలయం ముందు రాజకీయ బ్యానర్ ప్రదర్శించడం వంటి సంఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో అక్కడ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతోంది.
ఈ తనిఖీల కారణంగా టోల్ గేట్ నుండి అలిపిరి ఆర్చ్ వరకు వాహనాలు బారులు తీరాయి. సంబంధిత వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. తనిఖీలను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


