త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 18:నెల్లూరు జిల్లా: కావలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలోని జవహార్ భారతి కాలేజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ను కావలి శాసనసభ్యులు , దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , శుక్రవారం ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. క్రీడాలను ప్రారంభించిన ఆయన సరదాగా కాసేపు షటిల్ ఆడారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.. గెలిచినప్పుడు ఒదిగి ఉండాలని, ఓడినప్పుడు కృంగిపోకుండా తిరిగి విజయం కోసం ప్రయత్నించాలని క్రీడాకారులకు తెలిపారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


