
Home Minister : విజయనగరం జిల్లా : మార్చి 30: (త్రినేత్రం న్యూస్); జిల్లా సబ్ జైలును హోం మంత్రి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వంటగది ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ కూడా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీసులకు తగు సూచనలు చేస్తూ , సీసీ కెమెరాల పనితీరును చెక్ చేశారు. శక్తి టీమ్స్ పనితీరుపై కూడా ఆమె వివరాలు సేకరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

