Harish Kumar : రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ మేధావుల ఫోరం కార్యదర్శిగా కొడమంచిలి హరీష్ కుమార్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ఆలమూరు, ఆగస్టు.29. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం కార్యదర్శిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన కొండమంచిలి హరీష్ కుమార్ ని నియమించారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందిన హరీష్ వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నారు. తనకు ఈ పదవ రావడానికి సహకరించిన జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ కోసం పాటుపడతారని ఈ సందర్భంగా హరీష్ కుమార్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Harish Kumar Kodamanchili appointed as the Secretary

You cannot copy content of this page

Scroll to Top