TRINETHRAM NEWS

శరణన్న వారిని అనునిత్యం కాపాడే దైవం ఆ హరిహర సుతుడు : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద…

ఈరోజు 125- గాజులరామారం డివిజన్ రావి నారాయణరెడ్డి నగర్ ఈస్ట్ నందు శ్రావణ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ శరణన్న వారిని అనునిత్యం కాపాడే దైవం ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామియేనన్నారు.

ఈ మహా పడిపూజ కార్యక్రమంలో సోమేష్ గురుస్వామి, మురళీకృష్ణ, నారాయణ, కోటి, సూర్య, లోకేష్, తిరుపతి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.