
బీ ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు :– గుర్రం సురేష్.
Gurram Suresh : డిండి( గుండ్లపల్లి) ఏప్రిల్ 04, త్రినేత్రం న్యూస్. సీఐడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిండి మండలం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఐడీ విచారణ పేరుతో వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆపలేరని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు అరెస్ట్ అయిన వారిలో యూత్ పట్టణ అధ్యక్షులు ఎం డి రషీద్, బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు గుర్రం సురేష్, మండల సోషల్ మీడియా సెక్రటరీ ఎండీ బాసీత్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

