Dussehra Celebrations : ఘనంగా దసరా మహోత్సవాలు

TRINETHRAM NEWS

తేదీ : 27/09/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, మండలం, పట్టణంలో ఘనంగా దసరా శరన్ననవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి ఆలయం వద్ద పేరంపేట రోడ్డు , హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర , ఎనిమిది వ (అష్టమ) దసరా నవరాత్రి మహోత్సవాలు, మరియు సిటీ కేబుల్ ఆఫీస్ రోడ్డు రజకుల పేట నందు, ఫ్రెండ్స్ యూత్ ,అదేవిధంగా సాయి బాలాజీ టౌన్ షిప్ అసోసియేషన్ పంగిడిగూడెం రోడ్డు సమీపంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కులను తీర్చమని మరియు, ప్రజలందరూ సుఖ సంతోషం, మంచి ఆరోగ్యం, సిరిసంపదలు కలిగి ఎటువంటి కష్టనష్టాలు రాకుండా, లేకుండా ఉండాలని దేవతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.
వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు కమిటీ వాళ్లు అందజేశారు. కమిటీ వాళ్లు వెంకటకృష్ణ, రాజేష్, సంపత్ కుమార్, సత్యనారాయణ మరియు నన్నపనేని. సుమంత్ ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand Dussehra celebrations

You cannot copy content of this page

Scroll to Top