
Good Governance : ఎన్టీఆర్ జిల్లా : ఏప్రిల్ 01; (త్రినేత్రం న్యూస్); మైలవరం నియోజకవర్గం, మండలం, తోలుకోడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వి నుగంటి శోభన్ బాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు.
అదేవిధంగా ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. వీధి దీపాలు, నీటి సౌకర్యం, సీసీ రోడ్లు మొదలైనవి బాగానే ఉన్నాయని వివరణ అందించారు. నిరుపేదలకు ఇళ్ళు, డ్రైనేజీ సమస్య కొరత ఉందని ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాటిని అమలు పరచాలని కోరారు.
ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎలక్షన్ లు జరిగిన కూటమి ప్రభుత్వానిదే గెలుపు అని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

