–ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా ప్రతినిధి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో అగ్రభాగాన నిలుస్తున్న ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుకు గత 4 నెలలు వేతనాలు అనగా (సెప్టెంబర్, అక్టోబర్ నవంబర్ మరియు డిసెంబర్) పెండింగ్ వేతనాలు చెలించాలని అందక పోవడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారింది.
ఇంటికి కిరాయిలు , పిల్లల బడి ఫీజులు, కరెంటు బిల్లు, పాల బిల్లు, నిత్యవసర వస్తువులు కొనాలంటే జీతం వస్తేనే కొనుక్కునేది, వండుకొని తినేది. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని, ఉద్యోగులకు కుటుంబ పోషణ భారమై వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్(ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వీరందరికీ సకాలంలో వేతనాలు చెల్లించి ప్రభుత్వం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


