వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రూ.27 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పరిగి పట్టణంలో రూ.27 కోట్ల టీవీవీపీ నిధులతో అత్యాధునిక వసతి సౌకర్యాలతో 30 పడకల నుంచి స్థాయి పెంచుతూ 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయి పెంచుట కొరకు ఆస్పత్రి నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ,కుటుంబ సంక్షేమం,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ,అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ,చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
వారితో పాటు ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ,రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ,జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ,జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అధికారులు,నాయకులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


