టెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలి.
సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనోద్ధిన్.
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం డిండి మండలంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరిపడు కనీస వసతులు ఏర్పాటు చేయాలని సి పి ఐ పార్టీ రైతు సంఘం డిమాండ్ చేస్తుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మనోద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన డిండి మండల కేంద్రంలో విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యంగా ఎండ లు ఎక్కువగా ఉన్నాయని ,తక్షణమే ప్రభుత్వం సి సి కేంద్రాల వద్ద రైతులకు సరిపడు టెంట్లు , తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
వ్యవసాయ అధికారులు నిత్యం సి సి కేంద్రాల ను సందర్శిస్తూ రైతులకు తగిన ,సూచనలు,సలహాలు, ఇవ్వాలని కోరారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
కేంద్రాల్లో ధాన్యం నిల్వ వుంచకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


