త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు వేడుకలను ప్రారంభించారు.
కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డప్ప, సొసైటీ మెంబర్ దుర్గాప్రసాద్,చిరంజీవి,రాజేష్, తులసి నాయుడు,కిషోర్,అశోక్, గంగాధరం,రాజగోపాల్ నాయుడు, తదితర ముఖ్య నాయకులు పాల్గొని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు లోకేష్ భవిష్యత్ రాజకీయ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


